మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళంగడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలుతెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి…
Day: October 20, 2020
మీర్జాపూర్ 1ని మించేలా మీర్జాపూర్ 2: పంకజ్ త్రిపాఠి
ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజన్ 2 అక్టోబర్ 23న రాబోతుంది. సీజన్ 1లో ఖాలీన్ భయ్యాగా ఫేమెస్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సందర్భంగా తెలుగు సినీ పాత్రికేయలతో ముచ్చటించారు, ఆయనతో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీర్జాపూర్ సీజన్ 1 లో నేను పోషించిన కాలిన్ భయ్య పాత్ర నన్ను తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. రోజుకి సోషల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజన్ 2 రాబోతుందనే ప్రకటణ వచ్చినప్పటి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని…
‘ఆహ్వానం’ లోగో వదిలిన మంచు మనోజ్
వజ్ర మూవీ ప్రమోషన్ ఏజెన్సి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఎందరో స్టార్ హీరోలతో సహా ఎన్నో సూపర్హిట్ మూవీస్కి తమదైన శైలిలో ప్రమోషన్స్ చేసి ఆ చిత్రాలను ప్రేక్షకులకి మరింతగా చేరువయ్యేలా చేసిన ఘనత వారిది. ప్రస్తుతం వజ్ర గ్రూప్స్ ఆహ్వానం పేరుతో ఆతిథ్య రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా మొదటగా కన్వెన్షన్ హాల్ను ఏర్పాటు చేశారు. ఇటివలే ప్రముఖ హీరో మంచు మనోజ్ ఆహ్వానం లోగోను ఆవిష్కరించారు. అక్టోబర్ 23న సాప్ట్ లాంచ్ చేస్తున్నారు. `మీరు ఒక పార్టీని హోస్ట్ చేయాలంటే 500 నుండి 1000 మందికి వసతి కల్పించడానికి ఒక కన్వెన్షన్ హాల్ అవసరం. మేము మీ గో-టు సోర్స్. మీ ఈవెంట్లను మా ఉత్తమ సేవలతో ఆదర్శప్రాయంగా చేయడానికే మేము ఈ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. వినియోగదారుడి సంతృప్తే ప్రధమ…
ప్రభాస్ ‘రాధేశ్యామ్’కి యంగ్ మ్యూజిక్ దర్శకుడు
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “రాధేశ్యామ్. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబల్స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్స్టార్” డాక్టర్ యూ.వి. కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు,…
‘నర్తనశాల’: అర్జునుడిగా బాలయ్య
‘నర్తనశాలచిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫస్ట్లుక్ విడుదల. నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రంనర్తనశాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుకగా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు నటసింహ బాలకృష్ణ . తాజాగా నర్తనశాల నుండి నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఇందులో అర్జునుడిగా బాలయ్య లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘‘నాకు…
నిఖిల్ ‘18 పేజీస్’ షూటింగ్ ప్రారంభం
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నారు డైనమిక్ హీరో నిఖిల్. ఈ పంధాలో అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా 18 పేజీస్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో 100 % లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీతగోవిందం, ప్రతి రోజు పండగే వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో సక్సెస్ ఫుల్ నిర్మాతగా అందరి మన్ననలు పొందున్న బన్నీ వాసు నిర్మాణ సారధ్యంలో 18 పేజీస్ చిత్ర తెరకెక్కుతుంది. ఈ సినిమా నిర్మాణంలో బన్నీ వాసుతో పాటు భాగస్వామిగా వ్యవహరిడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇక సక్సెస్ ఫుల్ సినిమాలతో సినీ అభిమానుల్లో తనదైన…
‘సారధి’గా నందమూరి తారకరత్న
పంచభూత క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న “సారధి” చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో హీరోగా నందమూరి తారకరత్న, హీరోయిన్గా కోన శశిత నటిస్తున్నారు. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ‘గతంలో ఖోఖో నేపథ్యంలో ‘రథేరా’ నిర్మించాం. జనవరిలో విడుదల అయిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసి… ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి నాన్న… ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని అభినందించారు. ఈ సినిమా కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఖోఖో నేపథ్యంలోనే తారక రత్నతో “సారధి” సినిమా తీస్తున్నాం. ఇందులో తారక రత్న డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. కావున మీరందరూ ఆదరించాలి. ఈ చిత్రం ఒక…
ప్రతిభావంతుల కోసం ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’
గాయనీ గాయకులను, బ్యాండ్స్ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ సోమవారం నాడు ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’ కాంపిటీషన్ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య క్రిష్ణప్రియ నిర్మాత. వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన ఈ కాంపిటీషన్ సుమారు 12 వారాలు సాగనుంది. ఆ తరువాత 13వ వారంలో ఫైనల్స్ జరగనున్నాయి. ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’ ప్రారంభమైన సందర్భంగా శశి ప్రీతమ్ మాట్లాడుతూ ‘‘మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. సినిమాలో గాయనీ గాయకులు ప్రేక్షకులకు తెలుస్తారు. కానీ, వేరే వాళ్ళు బయటకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్ బ్యాండ్ సంస్కృతి హైదరాబాద్లో పెరిగింది. ఇప్పుడు రాక్ బ్యాండ్ ట్రెండ్ అవుతున్నాయి. పబ్స్లో వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. తొలుత ఇంగ్లిష్ పాటలతో ప్రారంభించిన బాండ్స్, పబ్లిక్ డిమాండ్…
‘చెప్పినా ఎవరూ నమ్మరు’కి యంగ్ హీరో సపోర్ట్
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం “చెప్పినా ఎవరూ నమ్మరు” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సారిగా నేటి యువతరం హీరోల్లో విజయపథంలో దూసుకెళ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విస్వక్ షేన్ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించి… అందరికి గుర్తింపు రావాలని చిత్ర యూనిట్ను అభినందించారు. చిత్ర నిర్మాత డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ… ” ముందుగా అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన…
‘18 పేజీస్’లో నిఖిల్కి జోడి సెట్టయింది
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం 18 పేజీస్. అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ 18 పేజీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి, వాటితో పాటే తాజాగా చిత్ర బృందం నిఖిల్ కి ఈ సినిమాలో జోడిని కూడా ఎంపిక చేశారు. అటు తన అభినయంతో ఇటు తన అందాలతో తెలుగు కుర్రకారు హృదయాల్ని దోచుకుంటున్న మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లుగా 18 పేజీస్ టీమ్ అధికారికంగా ప్రకటించారు. చాలా రోజులు…